అమ్మ సంరక్షణలో శ్వేతా బసు

 

ప్రత్యేక పరిస్థితుల్లో హైదరాబాద్‌లోని ఒక హోటల్‌ రూమ్‌లో దొరికిపోయిన టాలీవుడ్ హీరోయిన్ శ్వేత బసు ప్రసాద్ గత కొంతకాలంగా హైదరాబాద్‌లోని రెస్క్యూ హోమ్‌లో ఆశ్రయం పొందుతోంది. తాజాగా ఆమెను ఆమె తల్లికి అప్పగించాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్వేత బసు ప్రసాద్ తల్లి పిటిషన్ దాఖలు చేసుకున్న నేపథ్యంలో కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. శ్వేతను రెస్క్యూ హోమ్‌లో వుంచాల్సిన అవసరం లేదని, శ్వేతని జాగ్రత్తగా చూసుకుంటామని ఆమె తల్లి తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి శ్వేత బసు ప్రసాద్‌ని ‘నీకు నీ తల్లి వెంట వెళ్ళడం ఇష్టమేనా‌?’ అని ప్రశ్నించగా, శ్వేతా బసు ప్రసాద్ అందుకు అంగీకారం తెలిపారు. దాంతో న్యాయమూర్తి శ్వేతను తన తల్లి వెంట పంపించడానికి అంగీకరించారని డిఫెన్స్ లాయర్ వెల్లడించారు. గతంలో శ్వేత బసు ప్రసాద్‌ని రెస్క్యూ హోమ్‌కి తరలించాలని ఎర్రమంజిల్ న్యాయస్థానం ఆదేశించింది. ఆ ఆదేశాలను ఇప్పుడు నాంపల్లి కోర్టు తోసిపుచ్చింది.