సుష్మాస్వరాజ్‌ కు కిడ్నీ ఆపరేషన్..!

 

బీజేపీ సీనియర్ నేత, కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌ కిడ్నీ ఫెయిల్ కావడంతో ఢిల్లీలోని ఏయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఆమెనే స్వయంగా ఈవిషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపారు. కిడ్నీ ఫెయిల్యూర్ కారణంగా ప్రస్తుతం డయాలిసిస్ ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. ఈనేపథ్యంలోనే ఆమెకు త్వరలో ఆపరేషన్ జరగనున్నట్టు తెలుస్తోంది. కిడ్నీ దానానికి ఆమె కుటుంబసభ్యులు ప్రస్తుతం అందుబాటులో లేనందువల్ల వెంటనే ఆపరేషన్ చేయలేమని డాక్టర్లు తెలిపారు. కిడ్నీదాత దొరికి ఆపరేషన్ చేయడానికి కొంత సమయం పడుతుందని చెప్పారు. ఇదిలా ఉండగా  సుష్మకు కిడ్నీ ఇస్తానని రాహుల్‌వర్మ అనే వ్యక్తి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న పార్టీ నేతలు ఆమెను పరామర్శించడానికి తరలివస్తున్నారు.