ప్రేమజంట ఆత్మహత్య..

ఒకరినొకరు ప్రేమించుకున్నారు. కలిసి బతుకుదాం అనుకున్నారు. పెద్దలు తమ ప్రేమను అంగీకరించరేమోనని అనుమానంతో ఓ ప్రేమజంట నిండు ప్రాణాలు తీసుకున్నారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. కోదాడ పట్టణంలోని పెద్ద చెరువులో దూకి ప్రేమికులు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ప్రేమజంట ఆత్మహత్య కలకలం రేపుతోంది. మృతులు లక్ష్మీపురంకు చెందిన మణికంఠ, ఫాతిమా గా పోలీసులు గుర్తించారు. నిన్న రాత్రి  ప్రేమ జంట ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. వీరి ప్రేమ పెళ్లికి పెద్దలు అంగీకరించరేమోనని ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.