సంజయ్ దత్ కు సంఘీభావం తెలుపుతున్న సినీప్రముఖులు

 

సంజయ్ దత్ కు భారతీయ సినీ ప్రపంచం అండగా నిలబడింది. విద్యాబాలన్, రాజ్ కుమార్ హిర్వాణీ, సంజయ్ దత్ కు సుప్రీంకోర్టులో శిక్ష వేసినప్పుడు కూడా కోర్టు లాబీలోనే వున్నారు. వీరు సంజయ్ దత్ ఇంటికి తరచుగా వస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా, కరణ్ జోహార్, రితేష్ దేశ్ ముఖ్, బిపాసా బసు, హృతిక్ రోషన్, సమాజ్ వాదీ పార్టీ నేత జయ బచ్చన్ తాము సంజయ్ దత్ కు క్షమాభిక్ష పెట్టమని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు ప్రకటించారు. తమిళ్ సూపర్ స్టార్ రజనీ కాంత్ విలేఖరులతో మాట్లాడుతూ సంజయ్ దత్ వెంట తాను నిలబడతానని, సంజయ్ దత్ కు శిక్ష పడిన వెంటనే తాను ఆందోళనకు గురయ్యానని, ప్రస్తుతం సంజయ్ దత్ కు క్షమాభిక్ష కొరకు ప్రయత్నిస్తున్న వారి ప్రమేయంతో సంజయ్ కు త్వరలోనే క్షమాభిక్ష దొరుకుతుందని, మిగిలిన జీవితం సాఫీగా సాగిపోవాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. సమాజ వాదీ పార్టీ ఎం.పి. జయా బచ్చన్ మాట్లాడుతూ సంజయ్ చాలా మంచివాడు, అతనిలో చాలా మార్పు కనబడుతుంది, అతనికి కోర్టు ఇటువంటి శిక్ష విధించకుందా ఉండాల్సింది, పర్సనల్ గా నేను మహారాష్ట్ర గవర్నర్ ను క్షమాభిక్ష పెట్టాల్సిందిగా కోరుతానని తెలిపారు. బాలీవుడ్ సినీ ప్రముఖులు రణబీర్ కపూర్, సుజయ్ ఘోష్, ఫరహన్ అక్తర్, సోఫీ చౌదరి, రాజు హిరాణి, డైరెక్టర్ అపూర్వ లఖియ సంజయ్ దత్ నివాసానికి వెళ్ళి అతనికి అండగా నిలబడతామని అంటున్నారు.