బిల్డింగ్‌ను దత్తత తీసుకున్న సుమ, రాజీవ్..!!

 

ఇటీవల వచ్చిన వరదల కారణంగా కేరళ రాష్ట్రం చిన్నాభిన్నమైన సంగతి తెలిసిందే.. అయితే తాజాగా కేరళ గవర్నమెంట్ ఓ పిలుపునిచ్చింది.. వరదల కారణంగా బాగా దెబ్బతిన్న ప్రాంతం 'అలప్పీ'లోని ఏదైనా బిల్డింగ్‌ను ఎవరైనా దత్తత తీసుకుని దాన్ని పునరుద్ధరించి అప్పగించవచ్చు.. దీనిపై స్పందించిన సుమ, రాజీవ్ జంట తాము ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌ను దత్తత తీసుకుని పునరుద్ధరించనున్నట్టు తెలిపారు.. ‘కేరళ వరద బీభత్సం కారణంగా మీరంతా ముందుకు వచ్చి అక్కడి ప్రజలకు అండగా నిలిచారు.. అలప్పీ కోసం ఓ మంచి క్యాంపెయిన్‌ని అక్కడి వారు చేపట్టారు.. అలప్పీలోని ఏ బిల్డింగ్‌నైనా దత్తత తీసుకుని దాన్ని పునరుద్ధరించవచ్చు.. కాబట్టి మేము ఫ్యామిలీ వెల్ఫేర్ సెంటర్‌ను దత్తత తీసుకోవాలని నిర్ణయించుకున్నాం.. ఇది ఎంతో మంది ప్రజలకు నీడనిస్తోంది.. కాబట్టి అది త్వరగా పునరుద్ధరింపబడాలి.. ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టినందుకు సబ్ కలెక్టర్ కృష్ణతేజకు ధన్యవాదాలు.. ఆయనే మాకు ఈ దత్తత గురించి తెలిపారు.. ఇలా దత్తత తీసుకునేందుకు ఎవరైనా సుముఖంగా ఉంటే, వారు కూడా వెంటనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం’ అని సుమ, రాజీవ్ జంట తెలిపారు.