కానిస్టేబుల్‌ ను కిడ్నాప్ చేసిన మావోలు..

 

ఛత్తీస్‌గఢ్‌లోని ఓ పోలీసు కానిస్టేబుల్‌ కిడ్నాప్ అయినట్టు తెలుస్తోంది. వివరాల ప్రకారం.. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలోమావోయిస్టులు కిడ్నాప్ చేసినట్టు తెలుస్తోంది. అక్టోబర్ 31న పుస్వాడాలో విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తున్న క్రమంలో కానిస్టేబుల్‌ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారని  సుక్మా జిల్లా ఎస్పీ నిర్ధారించారు. ఇంకా కానిస్టేబుల్ ఆచూకీ కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టామని ఎస్పీ తెలిపారు.