తెదేపా పార్లమెంటరీ నాయకుడిగా సుజనాచౌదరి

 

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిన్న పార్టీ పార్లమెంటరీ నాయకులను నియమించారు. పార్టీ పార్లమెంటరీ నాయకుడిగా సీనియర్ నేత సుజనా చౌదరిని, లోక్ సభలో పార్టీ నాయకుడిగా తోట నరసింహంను, రాజ్యసభ నాయకుడిగా దేవేందర్ గౌడ్ లను నియమించారు. పార్లమెంటరీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నిమ్మల కిష్టప్ప, కోశాధికారిగా తోట సీతరామలక్షిలను నియమించారు. లోక్ సభలో ఉపనేతగా యన్.శివ ప్రసాద్, కొనకళ్ళ నారాయణను పార్టీ విప్ గానియమించారు. రాజ్య సభలో ఉపనేతగా సీయం రమేష్, విప్ గా గుండు సుధారాణి వ్యవహరిస్తారు. పార్టీ జాతీయస్థాయి అధికార ప్రతినిధులుగా గల్లా జయదేవ్,  కింజారపు రామ్మోహన్ నాయుడు మరియు సి,హెచ్. మల్లారెడ్డి వ్యవహరిస్తారు.