విద్యార్థిని మృతి.. హత్యా? ఆత్మహత్యా?

 

తిరుపతిలోని ఓ ప్రైవేట్ కాలేజీ క్యాంపస్‌లో రేఖ అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఆమె స్వస్థలం కడప జిల్లా రైల్వేకోడూరు. సోమవారం రాత్రి ఆమె తన హాస్టల్ గదిలో ఫ్యానుకు వేలాడుతూ కనిపించింది. అయితే రేఖ తల్లిదండ్రులు మాత్రం తమ కుమార్తె మరణం మీద అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తమ కుమార్తె కళాశాల యాజమాన్యం వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకుని వుండొచ్చొని, లేకపోతే ఆమె తలను గోడకేసి కొట్టి చంపిన ఆనవాళ్ళు కూడా కనిపిస్తున్నాయని అంటున్నారు. తమ కుమార్తె ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని, ఆమె శరీరంపై ఉరి వేసుకుని చనిపోయిన ఆనవాళ్లు లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రేఖ తలను బలంగా గోడకేసి కొట్టి ఉండటం వల్లే చనిపోయి ఉంటుందన్నారు.