సడక్ బంద్ కు సన్నాహాలు

 

ఈ నెల 21న టి.ఆర్.ఎస్. టి.జెఎసి తలపెట్టిన సడక్ బంద్ కు సన్నాహాలు చేస్తుంది. ఆదివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో నిర్వహించియన సడక్ బంద్ సన్నాహక సమావేశాలో టి.ఆర్.ఏ.స్. నేత హరీశ్ రావు మాట్లాడుతూ "ప్రభుత్వం సడక్ బంద్ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని,ఉదయం ఆరు గంటలనుండి సాయంత్రం ఐదు గంటలవరకు రోడ్డుమీద చీమకూడా కదలకుండా సడక్ బంద్ చేసి జయప్రదం చేయాలని,  ప్రజలకోసం చేపడుతున్న కార్యక్రమాన్ని అడ్డుకోకూడద''ని ప్రభుత్వానికి హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ స్వామీ గౌడ్ మాట్లాడుతూ అమరవీరుల సాక్షిగా తెలంగాణా సాధనకోసం చేపట్టిన ఈ కార్యక్రమం విఅజయవంతం చేయడం కోసం  కృషి చేయాలని టి.ఆర్.ఎస్., టి.ఆర్.ఏ.సీ.వీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రవణ్ మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి ఎన్ని అవాంతరాలు, ఎన్ని నిర్భంధాలు పెట్టినా సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని, ఈ సడక్ బంద్ కార్యక్రమానికి సుమారు ఇరవై ఐదు వేలమంది కార్యకర్తలను తరలించాలని పిలుపునిచ్చారు.  టి.ఆర్.ఎస్. సీనియర్ నాయకుడు నాయిని నరసింహ ప్రసంగిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, అరాచకాలను అరికట్టడంలో విఫలమైన పోలీసు యంత్రాంగం తెలంగాణా రాష్ట్ర సాధనకోసం పోరాడుతున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తనడైన శైలిలో ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.