ఆధిక్యంలో ట్రంప్.. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల ఓటింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే హోరా హోరీగా ఉన్న ఈ లెక్కింపులో ఎవరు గెలుస్తారో అన్న ఉత్కంఠం నెలకొంది. అయితే హిల్లరీ కంటే ట్రంప్ మాత్రం కాస్త ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండగా మరోపక్క ఈరోజు ఆరంభంలోనే స్టాక్ మార్కెట్లు భారీ నష్ట్లాల్లో కూరుకుపోయింది. అమెరికాలో ట్రంప్ అధికారంలోకి రానున్నారన్న వార్తలతో, ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. దీంతో స్టాక్ మార్కెట్ ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా పాతాళానికి కూరుకుపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే 1700 పాయింట్లకు పైగా నష్టంలో నిలిచింది. ప్రస్తుతం 1000 పాయింట్లకు పైగా నష్టంలో నడుస్తోంది. ప్రస్తుతం సెన్సెక్స్ 26,588 పాయింట్ల వద్ద కొనసాగుతోంది. ఇంకా చైనా, హాంకాంగ్, జపాన్ మార్కెట్లు కూడా 2 శాతం నష్టాల్లో కూరుకుపోయాయి.