నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు..

 

స్టాక్‌మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమౌతున్నాయి. సెన్సెక్స్ 353 పాయింట్లు నష్టపోయి 26,465 సూచీ వద్ద, నిఫ్టీ 120 పాయింట్లు నష్టపోయి 8,175 సూచీ వద్ద ట్రేడ్‌లో కొనసాగుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 67.71గా ఉంది. టాటా మోటార్స్, సిల్వర్, ఐచెర్ మోటార్స్, సిల్వర్ మైక్రో, జీఎస్‌కే హెల్త్, గోద్రెజ్ కన్జూమర్ వంటి తదితర కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా బ్యాంక్ ఆఫ్ బరోడా, జింక్, జింక్ మినీ వంటి కంపెనీల షేర్లు లాభాల్లో పయనిస్తున్నాయి.