మ్యాచ్ ఫిక్సింగ్ లో క్రికెటర్ శ్రీశాంత్ అరెస్ట్
posted on May 16, 2013 12:09PM
ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్ స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఇరుక్కుని అరెస్టయ్యాడు. మ్యాచ్ ఫిక్సింగ్ లో శ్రీశాంత్ పాత్ర ఉన్నట్లు తేలడంతో ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు రాజస్థాన్ రాయల్స్ కు చెందిన అజిత్ చండీల, అంకితా చౌహాన్ లను అరెస్టు చేశారు. వీరు ముగ్గురు స్పాట్ ఫిక్సింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అదుపులోకి తీసుకున్న ఏడుగురు బుకీలు వెల్లడించిన వివరాల మేరకు గత కొన్ని రోజులుగా శ్రీశాంత్, సహచర క్రికెటర్ల మీద నిఘా పెట్టిన పోలీసులు ఖచ్చితమయిన ఆధారాలు లభించాక ఈ రోజు అరెస్టులు మొదలు పెట్టారు. అంతర్జాతీయంగా క్రికెట్ మ్యాచ్ ఫిక్సింగ్ పై పెద్ద దుమారం చెలరేగుతున్నా, ఈ మ్యాచ్ ఫిక్సింగ్ వివాదాలు వస్తూనే ఉండడం బాదాకరం.