విశాఖ-సికింద్రాబాద్, విశాఖ-తిరుపతి.. 24 ప్రత్యేక రైళ్లు..

 

ప్రస్తుతం ఉన్న రద్దీని దృష్టిలో పెట్టుకొని విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్‌, తిరుపతిల మధ్య 12 చొప్పున ప్రత్యేక (సువిధ) రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది. విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ఈ నెల 22 నుంచి డిసెంబరు 27వ తేదీ వరకు ప్రతి మంగళవారం నాడు, తిరుగు ప్రయాణంలో ఈ నెల 23 నుంచి డిసెంబరు 28వ తేదీ వరకు ప్రతిబుధవారంనాడు ప్రత్యేకరైళ్లను నడపనున్నట్లు చెప్పారు. అదేవిధంగా విశాఖ నుంచి తిరుపతికి ఈ నెల 21 నుంచి డిసెంబరు 26 వరకు ప్రతి సోమవారం.. తిరుపతి నుంచి విశాఖకు 22 నుంచి డిసెంబరు 27 వరకు ప్రతి మంగళవారం ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.