యాకుబ్ భార్యకు రాజ్యసభ సీటు.. పదవికి వేటు

 

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన సమాజావాదీ పార్టీ ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే ఉంటుంది. అలాగే ఇప్పుడు కూడా అలాగే వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఇరకాటంలో పడ్డారు ఓ నేత. ముంబై జంట పేలుళ్ల కేసులో యాకుబ్ మెమెన్ ను గురువారం ఉరితీసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై సమాజ్ వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు ఫరూక్ ఘోసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ముస్లింలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని.. ఈ సమస్యలను అధిగమించాలంటే వారి తరపు మాట్లాడటానికి ఒక వ్యక్తి కావాలని.. సభలో వారి వాదనను వినిపించేందుకు ఒక గొంతు కావాలని.. ఈ నేపథ్యంలో యాకుబ్ మెమెన్ భార్య రహీన్ కు రాజ్యసభకు నామినేట్ చేయాలని పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు లేఖ రాశారు. ముస్లింల తరపున ఆమె పోరాడుతుందని లేఖలో పేర్కొన్నారు. అంతే ఈయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఫరూక్ ను వెంటనే పార్టీనుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.