సోనియా తలుచుకుంటే తెలంగాణ: జానా రెడ్డి

 

sonia gandi telangana, telangana issue jana reddy, jana reddy telangana

 

 

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తలుచుకుంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతుందని రాష్ట్ర మంత్రి జానారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్రం ఎప్పటికయినా ఇవ్వకతప్పదని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతల సంతకాలు తీసుకున్నమని.. సంతకాలు పెట్టని వారి పేర్లు ఈ నెల 30న జరిగే నిజాం కళాశాల బహిరంగసభలో వెల్లడిస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు మూడున్నర కోట్ల జనాభా ఉంది. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే మూడున్నర కోట్ల జనం ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ట పెంచాలని అధిష్టానాన్ని కోరామని అని తెలిపారు.