పోలీసుల అదుపులో సోనియా, రాహుల్... ఇది ప్రజాస్వామ్యమా?

 

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో ‘సేవ్ డెమొక్రసీ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పలు రాష్ట్రాల నుండి పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు తరలివచ్చారు. అయితే ఈ జంతర్ మంతర్ వద్ద నుండి ప్రారంభించి.. పార్లమెంట్ కి చేరుకోగానే పోలీసులు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ నేతలు పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. పోలీస్ స్టేషన్ లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో పోలీస్ స్టేషన్ గేట్లు, కాంపౌండ్ వాల్ ఎక్కి నిరసన తెలియజేస్తున్నారు. శాంతియుతంగా ఆందోళన చేసిన వారిని అడ్డుకోవడం ప్రజాస్వామ్యమా? అని వారు ప్రశ్నించారు.