సోనియా నామినేషన్

 

 

 

రాయబరేలి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నామినేషన్ దాఖలు చేశారు. తన తనయుడు రాహుల్ గాంధీతో కలసి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన సోనియాగాంధీ కాంగ్రెస్ కార్యకర్తల హర్షధ్వానాల మధ్య అట్టహాసంగా నామినేషన్ దాఖలు చేశారు. 2004, 2009 ఎన్నికలలో రాయబరేలీ నుంచి ఎన్నికలలో పోటీ చేసిన సోనియా భారీ మెజారిటీతో విజయం సాధించారు. ముచ్చటగా మూడోసారి విజయం సాధించాలని ఉవ్విళ్ళూరుతున్న సోనియాగాంధీ ఆశల మీద నీళ్ళు జల్లాలని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఆర్ఎస్ఎస్ కార్యకర్త కుమారుడు, సుప్రీంకోర్టు నాయవాది అగర్వాల్‌ని సోనియా గాంధీ మీద పోటికి నిలబెట్టింది. ఈనెల 30న ఈ నియోజకవర్గంలో పోలింగ్ జరగబోతోంది.