భవ్యశ్రీ మిస్సింగ్: దంపతుల మధ్య విభేదాలు లేవు

 

హైదరాబాద్‌కి చెందిన సాప్ట్వేర్ ఉద్యోగిని భవ్యశ్రీ చరిత అదృశ్యం కేసులో దర్యాప్తు జరుగుతోందని మాదాపూర్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భవ్యశ్రీ ఆచూకీ కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. భవ్యశ్రీ చరితకి, ఆమె భర్త కార్తీక్ చైతన్య మధ్య ఎలాంటి విభేదాలు, మనస్పర్థలు లేవని డీసీపీ తెలిపారు. కూకట్పల్లి ప్రాంతానికి చెందిన భవ్యశ్రీ గురువారం ఉదయం ఆఫీస్కు క్యాబ్లో వెళ్తున్నట్లు భర్త సెల్ఫోన్లో మెసేజ్ పెట్టింది. అనంతరం ఆమె ఆచూకీ తెలియకపోవటంతో ఆమె భర్త కార్తీక్ చైతన్య కూకట్పల్లి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు క్యాబ్ డ్రైవర్లను విచారిస్తున్నారు.