తెలంగాణలో ఆదివారం ఆరుగురు రైతుల ఆత్మహత్య

 

తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం నాడు మరో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ రైతులందరూ కరెంటు సరఫరా లేక పొలాలు ఎండిపోవడం, పొలం మీద చేసిన అప్పు తీరే అవకాశం లేకపోవడంతో ఆత్మహత్యలు చేసుకున్నారు. వరంగల్ జిల్లా గూడూరు మండలంలోని రాములు తండాకు చెందిన బానోతు ఈర్యా (42) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం ఎగ్గాం గ్రామానికి చెందిన చిన్న గంగన్న (45), మహబూబ్ నగర్ జిల్లా కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌కి చెందిన చిటికెల నర్సింహులు (30), నల్గొండ జిల్లా గుర్రంపోడుకు మండలం పాశంవానిగూడేనికి చెందిన మారెడ్డి వెంకటరెడ్డి (44) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మిడ్జిల్ మండలం బైరంపల్లికి చెందిన గోపాల్ జీ (60) కరెంటు తీగలను పట్టుకుని చనిపోయాడు. చిన్న ఎల్కిచర్ల పంచాయిగీలోని పుల్లప్పగూడానికి చెందిన గొల్ల నర్సింహులు (30) ఉరి వేసుకుని మరణించారు. దీంతో ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న రైతుల సంఖ్య నాలుగు వందలకు చేరిందని అంటున్నారు.