చంద్రబాబుతో శివరామకృష్ణన్ కమిటీ భేటీ

 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా ఏ ప్రాంతాన్ని ఎంపిక చేయాలన్న అంశం మీద ఏర్పాటు చేసిన శివరామకృష్ణన్ కమిటీ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని మీద చంద్రబాబుకు కమిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చింది. వీజీటీఎం (విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి) పరిధిలో తక్షణం రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని అవకాశాలున్నాయని కమిటీ తేల్చింది. అయితే వీజీఎంటీ పరిధిలో భూ లభ్యత తక్కువగా వుందని వివరించింది. భూమిని సేకరించగలిగితే ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అన్నిరకాలుగా అనువుగా వుంటుందని కమిటీ చెప్పింది.