కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారు
posted on May 10, 2013 7:32PM
కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య పేరు ఖరారయింది. కొత్తగా ఎన్నికయిన 121 కాంగ్రెస్ శాసన సభ్యులలో 102మంది ఆయనకు మద్దతు పలకడంతో ఆయన పేరు ఖరారు అయింది. బెంగళూరులో కంటీరవ స్టేడియంలో సోమవారం ఉదయం 11.15 గంటలకి ఆయనతో బాటు 15మంది మంత్రులు కూడా పదవీ ప్రమాణం చేస్తారు. సిద్దరామయ్య ఆగస్ట్ 12, 1948వ సం.లో మైసూరులో గల సిద్దరామ హుండీ అనే గ్రామంలో జన్మించారు. 1978లో రాజకీయాలలోకి ప్రవేశించిన ఆయన మొట్ట మొదటిసారిగా 1983లో బీయల్.డీ. అనే పార్టీ తరపున పోటీ చేసి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తరువాత జనత పార్టీలో చేరి మళ్ళీ జనతాదళ్(యస్) లో చేరి కొద్ది కాలం దేవగౌడ మంత్రివర్గంలో మంత్రిగా కూడా పని చేసారు.2006లో కాంగ్రెస్ పార్టీలో చేరి అప్పటి నుండి పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ నేడు రాష్ట్రానికి ముఖ్యమంత్రి పదవి చేపడుతున్నారు.