శోభా నాగిరెడ్డి మృతి: రాజకీయాలు ప్రారంభం

 

 

 

ప్రతి అంశాన్నీ రాజకీయాలకు వాడుకోవడం పార్టీలకి, వాటిలోని వ్యక్తులకు మామూలైపోయింది. ఇప్పుడు యాక్సిడెంట్‌లో మరణించిన భూమా శోభా నాగిరెడ్డి మరణం మీద కూడా రాజకీయాలు ప్రారంభమయ్యాయి. అయితే ఈ రాజకీయాలు శోభ మరణం ముందు నుంచే ప్రారంభమయ్యాయి. శోభా నాగిరెడ్డి చికిత్స పొందిన కేర్ ఆస్పత్రికి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి ఈ రాజకీయాలకు తెరతీశారు. శోభా నాగిరెడ్డి కారు ప్రమాదానికి గురి కావడానికి ప్రభుత్వ నిర్లక్షమే కారణమని ఆమె అన్నారు. రోడ్డు మీద రైతులు ధాన్యం ఆరబోయడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని, అలా ధాన్యం ఆరబోసే పరిస్థితులు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వమే ఈ ప్రమాదానికి కారణమని ఆమె అన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన నడుస్తోంది కాబట్టి ఈ యాక్సిడెంట్‌కి రాష్ట్రపతే కారణమని ఆరోపించలేదు. రాష్ట్రపతి వరకూ రానందుకు లక్ష్మీపార్వతి మేడమ్‌కి థాంక్స్. ఇదిలా వుంటే జగన్ మీడియా ఆయన ముఖ్యమంత్రి కావడమే శోభా నాగిరెడ్డి ముఖ్య లక్ష్యమని ప్రచారం చేస్తోంది. దానికి సంబంధించి శోభా నాగిరెడ్డి మాట్లాడిన వీడియోలను ప్రదర్శిస్తోంది.