1 న షిర్డీ ఆలయాన్ని పెల్చేస్తామని హెచ్చరిక

 

 

 

నిత్యం లక్షలాది భక్తులతో కిటకిటలాడే షిర్డీ సాయిబాబా ఆలయాన్ని జనవరి 1 వ తేదీన పేల్చివేస్తామనే ఓ హెచ్చరికతో కూడిన లేఖ ఆలయ సిబ్బందికి అందింది. దీనితో కంగారు పడిన ఆలయ డిఇఓ యశ్వంత్ ఆ లేఖను పోలీసుల చేతికి అందించాడు.

 

ఆ లేఖ ఫై బుల్దానా జిల్లా పోస్టల్ కార్యాలయం ముద్ర ఉంది. ఈ బెదిరింపు లేఖ ఫై అంకుష్ భూసే, బాస్కర్ కదం, బాలు లహుడ్కర్ అనే వ్యక్తుల సంతకాలు ఉన్నాయి. ఇక్కడ బాంబులు పెట్టేందుకు ఒప్పందం కూడా జరిగిపోయిందని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు తాము రూ. 350 కోట్లు తీసుకున్నామని వారు ఆ లేఖలో పేర్కొన్నారు.

 

ఈ లేఖతో ఆలయ సిబ్బంది లో టెన్షన్ ప్రారంభం అయింది. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నిఘా వ్యవస్తను మరింత పెంచారు. దీనితో పోలీసులు ఆ లేఖలో సంతకాలు చేసిన వ్యక్తుల గురించి ఆరా తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఇది ఆకతాయిల పనే అని మరో వాదన కూడా ఉంది.