ఎలక్ట్రానిక్ మీడియాకి షిండే హెచ్చరిక

 

 

 

కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే ఓ వర్గం ఎలక్ట్రానిక్ మీడియాను అణచివేస్తానని హెచ్చరించినట్లు వార్తలు వస్తున్నాయి. మహారాష్ట్ర షోలాపూర్ జిల్లా పర్యటనలో యువజన కాంగ్రెస్ సమావేశంలో మాట్లాడుతూ.. ఎలక్ట్రానిక్ మీడియాకి హెచ్చరికలు జారీ చేశారట. తనపైన, కాంగ్రెస్ పార్టీ పైన ఓ వర్గం మీడియా పనికట్టుకొని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొన్ని నెలలుగా ఒక మీడియా ఆధారాలు లేని తప్పుడు ప్రసారాలు ప్రచారం చేస్తూ..తమ పార్టీని రెచ్చగొట్టాలని చూస్తున్నారని అన్నారు. ఈ తరహా ప్రసారాలను వెంటనే ఆపకపోతే ఆ మీడియాను అణచివేస్తానని వార్నింగ్ ఇచ్చారట. అయితే ఆయన వ్యాఖ్యలు తీవ్ర దూమారాన్ని రేపుతున్నాయి. కొంతమంది నేతలు షిండే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.