1000 కిమీ లక్ష్యాన్ని చేదించనున్న ‘జగనన్నవదిలిన బాణం’

 

దాదాపు రెండు నెలల క్రితం ఇడుపులపాయలో పాదయాత్ర మొదలుపెట్టిన షర్మిల ఈ 67 రోజుల్లో మొత్తం 972.4 కిమీ దూరం నడిచారు. కనుక, మరో రెండు రోజుల్లో ఆమె కూడా 1000 కిమీ మైలురాయిని నల్గొండ జిల్లాలో దాటనున్నారు. ఆమె ఈ నెల 18న గురజాల వద్ద గుంటూరు జిల్లాలో ప్రవేశిస్తారు. జిల్లలో ఒకరోజు పాదయాత్ర కొనసాగించిన తరువాత, శాసన మండలి ఎన్నికల సందర్భంగా 19 సాయంత్రం నుండి 21 సాయంత్రం వరకు అమలులో ఉండే ఎన్నికల నియమావళి కారణంగా ఆమె తాత్కాలికంగా తన పాదయాత్రను ఆపవలసి ఉంటుంది. గుంటూరు జిల్లాలో దాదాపు 270కిమీ దూరం నడువనున్న ఆమె మొత్తం 13 నియోజక వర్గాలను పర్యటిస్తారు. జగనన్న వదిలిన బాణంగా తనను తానూ అభివర్ణించుకొన్న షర్మిల, ఇప్పుడు 1000కిమీ లక్ష్యం చేదించనున్నది.