డౌరీ కేసులో శంకర్ రావు & ఫ్యామిలీ

 

మాజీ మంత్రి శంకర్ రావు గ్రీన్ ఫీల్డ్స్ కేసులో ఇదివరకు అరెస్టయినప్పుడు ఆయనకి గుండె జబ్బు ఉన్న కారణంగా అరెస్టు నుండి తప్పించుకోగలిగారు. అయితే, ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఆయన కుటుంభ సభ్యుల మీద మరో కొత్త కేసు నమోదయింది. ఈ సారి కేసు వేసింది మాత్రం స్వయాన్న ఆయన కోడలు వంశీ ప్రియ.

 

ఆరు నెలల క్రితమే ఆమె సెంట్రల్ క్రైం పోలీసు స్టేషన్లో తన మామగారు, అత్తగారు, భర్త మరియు ఆడపడుచు తనను కట్నం కోసం వేధిస్తున్నారంటూ ఫిర్యాదు చేసినపుడు వారిపై సెక్షన్ 498-ఏ క్రింద కేసు నమోదు చేసినప్పటికీ, వారు హై కోర్టు నుండి బెయిల్ తెచ్చుకొని తమ పరపతితో పోలీసు విచారణ జరపకుండా అడ్డుకొంటున్నారని, ఆమె హై కోర్టులో పిటిషను వేశారు. అయితే కోర్టు ఈ కేసు విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. శంకర్ రావు ఆరోగ్యకారణాలతో క్రిందటి సారి అరెస్ట్ తప్పించుకొన్నపటికీ, ఈ సారి మాత్రం వరకట్న వేధింపుల కేసులో అరెస్టు తప్పించుకోవడం కష్టమేనని చెప్పవచ్చును. పైగా ఆయన గత కొంత కాలంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని ఆయన సోదరుడిని లక్ష్యంగా చేసుకొని తీవ్ర విమర్శలు అభియోగాలు చేస్తున్నారు. ఒకవేళ, ముఖ్యమంత్రి గనుక పోలీసులకి అనుమతిస్తే ఈ సారి శ్జంకర్ రావు అరెస్ట్ తప్పించుకోవడం కష్టమే.