‘చపాతి’ బాగాలేదు: అద్వానీ

 

దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ‘చపాతి’ ఘటనపై బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్కే అద్వానీ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్య చర్య కాదని అద్వానీ పేర్కొన్నారు. ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో రంజాన్ ఉపవాస దీక్షలో వున్న ముస్లింతో శివసేన ఎంపీలు బలవంతంగా చపాతి తినిపించిన ఘటనపై అద్వానీ ఈ విధంగా స్పందించారు. తమకు సంప్రదాయ మహారాష్ట్ర వంటలు పెట్టలేదనే ఆగ్రహంతో 11 మంది శివసేన ఎంపీలు ముస్లిం కేటరింగ్ సూపర్వైజర్‌తో బలవంతంగా చపాతి తినిపించే ప్రయత్నం చేశారు. ఈ సంఘటనపై బుధవారం పార్లమెంట్ ఉభయ సభలు దద్దరిల్లాయి.