టీడీపీ ఆరో జాబితాలోనూ హరికృష్ణ పేరు గల్లంతు

 

టీడీపీ ఆరో జాబితాలో కూడా హరికృష్ణ పేరు లేదు తెలుగుదేశం పార్టీ సీమాంధ్రలో అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థుల ఆరో జాబితాని ప్రకటించింది. ఐదుగురు అభ్యర్థుల పేర్లతో కూడిన ఈ జాబితాలో కూడా తెలుగుదేశాధినేత నారా చంద్రబాబు నాయుడు బావమరిది నందమూరి హరికృష్ణ పేరు కనిపించలేదు. టీడీపీ ఆరో జాబితా ఇలా వుంది.. పిఠాపురం : పోతుల విశ్వం, పెద్దాపురం : నిమ్మకాయల చిన్న రాజప్ప, భీమవరం : పులవర్తి రామాంజనేయులు, సర్వేపల్లి : సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అనంతపురం (అర్బన్) : ప్రభాకర్ చౌదరి.