తొలిరోజు సమ్మె సక్సెస్
posted on Aug 13, 2013 5:59PM
తెలంగాణ ప్రకటణకు నిరసగా సీమాంద్ర ఉద్యోగ సంఘాలు తల పెట్టిన సమ్మె తొలిరోజు విజయవంతం అయింది.. ఈ మేరకు ఎపిఎన్జీవోస్ నేత అశోక్బాబు ఒక ప్రకటన చేశారు. ఈ రోజు సచివాలంలో విలేకరులతో మాట్లాడిన ఆయన సమ్మెకు సహకరించిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు.
సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడిన అశోక్ బాబు, సీమాంద్రలోని అన్ని జిల్లాల్లో సమ్మె విజయవంతం అయినట్టు తమకు సమాచారం అందిందన్నారు. సమ్మెలో పాల్గొనే వారు విద్వేషాలు రెచ్చగొట్టే నినాదాలు ప్రసంగాలు చేయవద్దని కొరారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని ప్రభుత్వం పునఃసమీక్షించాలని ఆయన కోరారు.
కొంత మంది నాయకులు ఇక్కడ సమ్మె చేయవద్దని తమని విజయవాడ, తిరుపతి వెళ్లమని తమని బెదిరిస్తున్నారని చెప్పారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే రేపు రాష్ట్రం విడిపోయాక ఎలా ఉంటుందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన మీకు ఎంత అవసరమో, రాష్ట్రం కలిసి ఉండటం తమకు అంత అవసరం అన్నారు.