మున్సిపల్ ఫలితాలు: సీమాంధ్రలో అగ్రస్థానంలో టీడీపీ

 

 

 

మునిసిపల్ ఎన్నికల ఫలితాలలో టీడీపీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తోంది. సీమాంధ్రలో మొత్తం 2571 మునిసిపల్ కౌన్సిలర్ స్థానాలు వుంటే, ఇప్పటి వరకు 2156 స్థానాలకు ఫలితాలు ప్రకటించారు. వీటిలో తెలుగుదేశం పార్టీ 1192 స్థానాలు గెలుచుకుని అగ్రస్థానంలో వుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 784 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ పార్టీ 52 కౌన్సిలర్ స్థానాలు పొందింది. ఇక కమ్యునిస్టులు 25 స్థానాల్లో, ఇతరులు 103 స్థానాల్లో విజయం సాధించారు.