సీమాంద్ర జిల్లాల్లో టీడీపీ హవా

 

 

 

సీమాంధ్ర జిల్లాల్లో ముసినిపల్ ఎన్నికలలో తెలుగుదేశం మంచి ఫలితాలను సాధిస్తూ ముందంజలో వుంది. ఇప్పటి వరకు మాచర్ల, నరసరావుపేట మునిసిపల్ స్థానాలను తెలుగుదేశం పార్టీ సొంతం చేసుకుంది. అలాగే విజయనగరం మునిసిపల్ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. అలాగే సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్వస్థలమైన మడకశిర మునిసిపాలిటీని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది.