ఓట్ల కౌంటింగ్: సీమాంధ్ర, తెలంగాణలో తాజా బలాబలాలు

 

సీమాంధ్రలోని 195 అసెంబ్లీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ మధ్యాహ్నం రెండున్నర గంటల సమయానికి 36 స్థానాలు గెలుచుకుంది. మరో 74 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. వైసీపీ 26 స్థానాల్లో గెలిచింది. మరో 34 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. బీజేపీ ఒక్క స్థానాన్ని గెలుచుకుని మరో రెండు స్థానాల్లో లీడింగ్‌లో వుంది. ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. అలాగే సీమాంధ్రలోని 25 పార్లమెంట్ సీట్లలో తెలుగుదేశం ఒక స్థానాన్ని గెలుచుకుంది. 14 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. వైసీపీ రెండు స్థానాల్లో గెలిచి 5 స్థానాల్లో లీడింగ్‌లో వుంది. బీజేపీ మూడు స్థానాల్లో లీడింగ్‌లో వుంది.