ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీ.. దుండగుల కాల్పులు..

 

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ గెలుపుపొందిన విషయం తెలిసిందే. దీంతో ట్రంప్ అనుచరులు సంబరాల్లో మునిగితేలుతున్నారు. అయితే ఇదంతా బాగానే ఉన్నా.. ఇప్పటికీ ట్రంప్ గెలుపును కొంతమంది అమెరికన్లు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనిలో భాగంగానే.. నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. అయితే వీరిపై కాల్పులు చోటుచేసుకోవడంతో కలకలం రేగింది. వివరాల ప్రకారం..సియాటెల్ లో ట్రంప్ కు వ్యతిరేకంగా ర్యాలీ జరుగుతుంటే, గుర్తు తెలియని దుండగులు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరుపగా, పదుల సంఖ్యలో గాయపడినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన వారిని స్థానికులు, పోలీసు అధికారులు సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. కాల్పులు జరిపిన వ్యక్తి ఒకరేనా? లేదా గ్రూప్ గా వచ్చారా? అన్న విషయమై సమాచారం లేదని, విచారణ జరుపుతున్నామని, నిందితుల కోసం గాలింపు ప్రారంభించామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు.