అతను బస్సు డ్రైవర్ కాదు.. ట్రాక్టర్ డ్రైవర్!

 

మెదక్ జిల్లాలో రైలు ఢీకొన్ని స్కూలు బస్సుకు సంబంధించి షాకింగ్‌కి గురిచేసే విషయం ఒకటి బయటపడింది. యాక్సిడెంట్‌కి గురైన బస్సును డ్రైవ్ చేసింది రెగ్యులర్‌గా బస్ డ్రైవ్ చేసే డ్రైవర్ కాదు.. ఒక ట్రాక్టర్ డ్రైవర్. బస్సు డ్రైవర్ సెలవు పెట్టడంతో పాఠశాల యాజమాన్యం ఒక ట్రాక్టర్ డ్రైవర్ని పిల్లలను తీసుకురమ్మని బస్సు ఇచ్చి పంపినట్టు తెలిసింది. ట్రాక్టర్ నడిపే వ్యక్తి నిర్లక్ష్యంగా బస్సును నడపడంతో ఇంత ఘోరం జరిగింది. స్కూలు బస్సులో మొత్తం 38 మంది ఉన్నారు. వారిలో 13 మంది అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మరో ఏడుగురు ప్రాణాలు విడిచారు. మరో 15 చిన్నారులు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన నుంచి కేవలం ముగ్గురు చిన్నారులు మాత్రమే సురక్షితంగా బయట పడ్డారు.