ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ఉత్కంఠ

 

ఢిల్లీలోని రాంలీల మైదానంలో రెండు రోజులపాటు జరిగే "సేవ్ ఆంధ్రప్రదేశ్" సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ.... కేంద్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా విభజన బిల్లు పెట్టిందో జాతీయ పార్టీలకు తెలపడానికే ఈ సభ నిర్వహించబోతున్నాం అని అన్నారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సభకు సుమారు 15 నుంచి 20 వేల మంది హాజరవుతారని, ఇది పూర్తిగా శాంతియుత వాతావరణంలోనే తమ నిరసన తెలుపుతామని ప్రభుత్వానికి హామీ ఇస్తున్నామన్నారు. అయితే ఇప్పటికే ఈ సభ మొత్తం కూడా సమైక్యాంద్ర శ్రేణులతో నిండిపోయింది. ఢిల్లీలో ప్రస్తుత పరిస్థితి చాలా వేడిగా ఉండి. ఈ క్రమంలో ఎవరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో, ఎవరు ఎలా స్పందిస్తారో అనే విషయాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.