సర్దార్ పటేల్‌కి చంద్రబాబు నివాళి

 

ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను తలచుకుంటేనే తనలో దేశభక్తి పెల్లుబుకుతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు పాల్గొని ఉద్యోగుల చేత ఐక్యతా ప్రతిజ్ఞ చేయించారు. దేశం అంతా ఒక్కటిగా వుండాలన్న లక్ష్యంతో సర్దార్ పటేల్ తన జీవితమంతా పోరాడారని చంద్రబాబు చెప్పారు. మనం ఈరోజు ప్రజాస్వామ్యంలో వున్నామంటే దానికి కారణం పటేల్ అని అన్నారు. దేశ హోం శాఖ మంత్రిగా ఎనలేని సేవలు చేసిన వల్లభాయ్ పటేల్ అంటేనే దేశ సమైక్యతకు మారుపేరు అని చంద్రబాబు పేర్కొన్నారు.