రేపు కోర్టులో లొంగిపోనున్నసంజయ్ దత్త్

 

బాలివుడ్ నటుడు సంజయ్ దత్త్ రేపు ముంబైలోని టాడా కోర్టు ముందు లొంగిపోతునట్లు ఈ రోజు కోర్టుకు తెలియజేసారు. 1993 ముంబై దాడుల కేసులో చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్న నేరానికి అతనికి సుప్రీంకోర్టు ఐదు సం.లు జైలు శిక్ష విదించింది. గతంలో అతను ఒకటిన్నర సం.లు జైలు శిక్ష అనుభవించినందున,ఆయన ఇప్పుడు మిగిలిన మూడున్నర సం.లు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. బాలివుడ్ సినీ రంగం ఆయనపై దాదాపు రూ.200 కోట్ల పెట్టుబడులుపెట్టి సినిమాలు తీస్తున్న ఈ తరుణంలో ఆయన ఏకంగా మూడున్నర సం.లు జైలులో గడిపితే తీవ్ర నష్టం భరించక తప్పదు. కనుక తమ సినిమాలు పూర్తయ్యే వరకు అతనికి మరికొంత కాలం బయట ఉండేందుకు అనుమతి ఈయాలని కోరుతూ కొందరు నిర్మాతలు మూడు రోజుల క్రితం సుప్రీం కోర్టులో పిటిషను వేసారు. కానీ సుప్రీంకోర్టు దానిని తిరస్కరించడంతో ఇంక సంజయ్ దత్త్ జైలుకి వెళ్లక తప్పడంలేదు. రేపు జైలులోకి వెళ్ళిపోతే మళ్ళీ అతను 2016 నవంబరులో విడుదల అవుతారు.