2013లోనే ఎన్నికలు సమాజ్ వాదీ పార్టీ
posted on Mar 26, 2013 7:39AM
యూపీఏ పక్షంలోని భాగస్వాములు ఒక్కరొక్కరే బయటకు వెళ్ళిపోతున్నారు. వారం రోజుల క్రితం డిఎంకే యూపీఏ సంకీర్ణ ప్రభుత్వానికి తమ మద్ధతు ఉపసంహరించుకుంది. తాజాగా ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ కూడా మద్ధతు ఉపసంహరించుకునే ఆలోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 2013లోనే లోక్ సభ ఎన్నికలలు వెళ్లేందుకు సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ నిర్ణయం తీసుకున్నారని, యూపీఏ కూటమికి బయటినుంచి ఇచ్చే మద్దతును ఉపసంహరించుకోవాలని, మే రెండో వారంలో ఓటింగ్ కు వచ్చే ఆర్థిక బిల్లు ఆమోదం పొందకుండా చేస్తే చాలు అని యూపీఏ సర్కారు దానంతటదే కూలిపోతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హోలీ తరువాత భారీ ర్యాలీ తలపెట్టిన ములాయం సింగ్ యాదవ్ ఆ సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.