సర్వేపై హైకోర్టు నోటీసులు

 

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే మీద హైకోర్టులో దాఖలైన పిటిషన్‌ హైకోర్టులో విచారణకు వచ్చింది. సమగ్ర సర్వే నిర్వహించడం మీద కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్ మీద కౌంటర్ దాఖలు చేయడానికి తెలంగాణ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు హైకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చింది.