బాబు బండారం.. బయటపెడితే ఇక అంతే!!

ఆంధ్రప్రదేశ్ లో ఐటీ హీట్ పెంచుతుంది. చంద్రబాబు బండారం మొత్తం బయట పడితే ఆయన అక్రమ సంపాదన రెండు లక్షల కోట్ల వరకు ఉంటుందని ఆరోపించారు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. పీఎస్ వద్దే సుమారు రెండు వేల కోట్ల వరకు అక్రమాల రికార్డులు దొరికాయంటే ఇక చంద్రబాబు వద్ద ఇంకెన్ని ఉంటాయోనని ఆయన కామెంట్ చేశారు. అలాగే.. ఇప్పుడు బయటపడింది కేవలం తీగ మాత్రమే అని డొంక చాలా పెద్దగా ఉందని సజ్జల వ్యాఖ్యానించారు. దీనిపై పవన్ ఎందుకు మాట్లాడట్లేదని కూడా ఆయన ప్రశ్నించారు.

అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా మాట్లాడుతూ.. కేవలం ఒక పర్సనల్ సెక్రెటరీ నివసించే నివాసం వద్దనే ఓ చిన్న అపార్ట్ మెంట్ లో వేలకోట్లకు పైగా డబ్బు... లెక్క చూపలేనంత ఆదాయం.. లభించిందని అన్నారు. ఆ ధనానికి సంబంధించి అక్కడే అవసరమైన పత్రాలన్నీ కనిపించాయంటే అందుకు మూలాధారమైన వ్యక్తి  చంద్రబాబుగారి ఖజానా వద్ద అక్రమ సంపాదన ఇంకెంత ఉండవచ్చో అంచనా వేయచ్చని ఆయన తెలిపారు.

అంతేకాకుండా చంద్రబాబు గారు ఇప్పటికీ తమ ప్రభుత్వంపై సవాల్ విసురుతుంటారని సాక్ష్యాలు చూపమని, కేసులుంటే బుక్ చేయమని ఈరోజు కేవలం తన సెక్రెటరీ వద్దె లభించిన రెండు వేల కోట్లే దీనికి సాక్ష్యాలని, తీగ దాకా వచ్చిన సాక్ష్యంతో డొంక లాగటానికి ఎంతో సమయం పట్టదని ఆయన హెచ్చరించారు. అలాగే... బాబుగారి బండారం మొత్తం బయట పడితే అది ఖచ్చితంగా రెండు లక్షల కోట్లకుపైగా ఉంటుందని ఆయన గట్టిగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా అందుకు తగిన ఆధారాలు ఉన్నట్లు కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.