పార్టీ మారనున్న సబితా ఇంద్రారెడ్డి?

 

కాంగ్రెస్ నాయకురాలు, మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టి తన కుమారుడు కార్తీక్ రెడ్డితో సహా తెరాసలో చేరే అవకాశం వుందన్న పుకార్లు తెలంగాణ రాష్ట్ర రాజకీయ వర్గాలలో షికార్లు చేస్తున్నారు. తాజాగా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దూత దిగ్విజయ్ సింగ్ ఆధ్వర్యంలో జరిగిన మేధోమథన సదస్సుకు సబితా ఇంద్రారెడ్డి, ఆమె కుమారుడు కార్తీక్ హాజరు కాకపోవడం రాష్ట్ర రాజకీయ వర్గాలలో వీరిద్దరూ పార్టీ మారబోతున్నారన్న ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. సబిత, ఆమె కుమారుడు గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు పూర్తి దూరంగా వుంటున్నారని, కాంగ్రెస్ పెద్దలు ఆహ్వానిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని సమాచారం.