ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ దాఖలు చేసిన అఫిడిట్ పై అశ్వతామరెడ్డి ఫైర్

 

 

ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టి 44 రోజులు పూర్తయింది. మరీ నిరసనలకు ముగింపు ఎప్పుడు. ఇవాళ హైకోర్టు ఏం తీర్పు చెప్పబోతోంది. కార్మికులకు ఊరటనిచ్చే నిర్ణయం ఏదైనా వస్తుందా లేక ప్రభుత్వం చెప్పిన సమాధానానికి ఊ కొట్టి మిన్నకుండిపోతుందా, నెలన్నర రోజులుగా ఆర్టీసీ కార్మికులు ఆందోళనతో హోరెత్తిస్తున్నారు. సుదీర్ఘ పోరాటం తో తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నిరసనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం పట్టువీడడం లేదు. ఆర్టీసీ నష్టాల్లో ఉందని సంస్థను కాపాడటం దాదాపుగా అసాధ్యం అనే రీతిలో హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. దీంతో అసలు ఈ సమ్మెకు ముగింపు ఎప్పుడు ఆందోళనలకూ పుల్ స్టాప్ పడేలా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. సుప్రీం కోర్టు మాజీ జడ్జిలతో కమిటీ వేస్తాం అంటూ హై కోర్టు చేసిన సూచనను ప్రభుత్వం తిరస్కరించింది. పారిశ్రామిక వివాదాల చట్టం ప్రకారం కమిటీ ప్రస్తావన లేదంటూ నో చెప్పింది. దీంతో సమస్య మొదటికొచ్చింది. మరోవైపు కార్మిక సంఘాల జేఏసీ ఒక్కో మెట్టూ దిగుతున్నాయి. విలీనం డిమాండ్ ను పక్కన పెట్టామని ఇప్పటికే ప్రకటించాయి. చర్చలు చేపడితే మరి కొన్ని డిమాండ్ల విషయంలోనూ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ ప్రభుత్వ వైఖరి మాత్రం అందుకు విరుద్ధంగా కనిపిస్తొంది. దీంతో అసలు ఈ సమ్మె ఎన్నాళ్లు జరుగుతుంది ఎప్పటి కి ఫుల్ స్టాప్ పడుతుంది అనేది అయోమయంగా తయారైంది.సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించాలంటూ ప్రభుత్వం హైకోర్టులో మొదట్నుంచీ వాదిస్తూనే ఉంది. శనివారం నాడు మరింత ఘాటుగా అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. పారిశ్రామిక వివాదాల చట్ట ప్రకారం ముందుగా సమ్మె నోటీసు ఇవ్వాలని చర్చలు జరుగుతుండగా సమ్మె చేపట్టరాదని.. కానీ కార్మికులు చట్ట విరుద్ధంగా సమ్మెకు దిగారని అఫిడవిట్లో పేర్కొంది. ఇప్పటికిప్పుడు కార్మికులు వీధుల్లో చేరతామన్న కొనసాగించటం కష్టమేనంటూ ఆర్టీసీ ఇన్ చార్జి ఎండీ సునీల్ శర్మ అఫిడవిట్ ఇచ్చారు.సునీల్ శర్మ పేరుతో ఇచ్చిన అఫిడవిట్ పై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. అసలు ఆర్టీసీ గురించి సునీల్ శర్మకు ఏం తెలుసని ప్రశ్నించారు.ఎండీగా బాధ్యతలు చేపట్టిన 17 నెలల్లో కనీసం ఏడు సార్లు కూడా ఆఫీసుకు రాని వ్యక్తి అఫిడవిట్ ఇచ్చారని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.హైకోర్టుకు సమర్పించింది రాజకీయ అఫిడవిట్ల ఉందంటూ జేఏసీ నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వం పట్టువీడడం లేదు మరోవైపు కార్మిక సంఘాల దగ్గర ఉన్న నిరసన అస్త్రాలన్నీ అయిపోతున్నాయి. ఇప్పటికే సుదీర్ఘ సమ్మెతో కార్మికులు కూలీ పనులు, వృత్తిపనులు చేసుకుంటున్నారు. మరి కొందరు అప్పులతో నెట్టుకొస్తున్నారు. జేఏసీ నేతలు తమంతట తాము గృహ నిర్బంధాలు చేసుకొని నిరసన దీక్షలు చేసినా పోలీసులు తాళాలు పగలగొట్టి మరీ దీక్ష భగ్నం చేశారు.ఈ సమ్మెకు ఫలితం ఎంటీ, కనీసం ముగింపు ఎప్పుడు ఈ ప్రశ్నలకు హై కోర్టు తీర్పు సమాధానం చెబుతుందా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. హైకోర్ట్ ఇచ్చిన కమిటీ సూచనను కూడా ప్రభుత్వం తిరస్కరించింది. సమ్మె చట్టవిరుద్ధం మాత్రమే కాదు విపక్షాలతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర అంటూ అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది. ఇలాంటి సమయంలో సోమవారం హై కోర్టు ఏం చెప్ప నుంది అనేది ఆసక్తికరంగా మారింది.