దురంతో ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ

 

ఈమధ్య కాలంలో రైళ్ళలో దోపిడీలు ఎక్కువైపోయాయి. దోపిడీ దొంగలకు రైళ్ళను దోచుకోవడం చాలా వీలుగా ఉన్నట్టుంది. రైళ్ళలో మామూలు ప్రయాణికుల మాదిరిగా ప్రయాణించడం. ఏ అర్ధరాత్రివేళో ప్రయాణికులను ఆయుధాలతో బెదిరించడం. దొరికినంత దోచుకుని పారిపోవడం. రైళ్ళలో దోపిడీలు ఇంత విరివిగా జరుగుతున్నా రైల్వేశాఖ మాత్రం చోద్యం చేస్తున్నట్టుంది. అందుకే మరో రైలు దోపిడీ జరిగింది. విశాఖ నుంచి హైదరాబాద్ వస్తున్న దురంతో ఎక్స్ప్రెస్లో శుక్రవారం తెల్లవారు ఝామున దోపిడీ జరిగింది. దొంగలు ప్రయాణికుల నుంచి భారీగా నగదు, బంగారాన్ని దోచుకున్నారు.