వెహికల్ బోల్తా.. 15 మందికి గాయాలు..

వరంగల్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలం జమాండ్లపల్లి గ్రామం సమీపంలో టాటాఏస్ వెహికల్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే వారిలో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. కాగా మేడారం జాతరకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.