ఢిల్లీ కాలుష్యంపై సుప్రీం ఆగ్రహం...


ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని.. ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే తప్ప ఎవరూ రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు పాఠశాలలకు కూడా సెలవులు ప్రకటించారు. అయితే ఇప్పుడు ఢిల్లీలో నెలకొన్న పరిస్థితిపై స్పందించిన సుప్రీంకోర్టు ప్రభుత్వంపై ప్రభుత్వపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీని గజగజలాడిస్తున్న కాలుష్యభూతాన్ని ఎలా ఎదుర్కొంటారో చెప్పాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని నిలదీసింది. 48 గంటలలో కనీస ఉమ్మడి కార్యక్రమంతో తమ ముందుకు రావాలని నిర్దేశించింది. ఢిల్లీ కాలుష్యం నివారణపై విధానమంటూ ఏదైనా ఉంటే తెలియజేయాలని స్పష్టం చేసింది. ఏంచేస్తారు? ఎలా చేస్తారు? ఎంతమంది సిబ్బంది కావాలి? అంటూ ధర్మాసనం ప్రశ్నల వర్షం కురిపించింది.