కేసీఆర్ కుటుంబం,తెలంగాణ ప్రజల మధ్య కురుక్షేత్రం

 

కేసీఆర్ తెలంగాణను బంగారు తెలంగాణగా మారుస్తానని ప్రజలను మాటలతో మభ్య పెట్టి అధికారంలోకి వచ్చారని ఆరోపించారు.నిజామాబాద్‌లో కాంగ్రెస్‌ నేత అరికెల నర్సారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు.టీఆర్ఎస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయలేదన్నారు.రూ.లక్ష రుణమాఫీ పేరుతో రైతులను నిండా ముంచారని, కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేకపోయారని విమర్శించారు.ఆద‌ర్శంగా ఉన్న రైతులు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నార‌న్నారు.ప‌సుపు బోర్డు, సెజ్ హామీ ఎక్క‌డ పోయిందో చెప్పాల‌న్నారు.పసుపు బోర్డు సాధిస్తామని హామీ ఇచ్చిన కవిత మాట నిలబెట్టుకోలేక పోయారన్నారు.కేసీఆర్ కుటుంబంలోని న‌లుగురు దోపిడీదారులు ఒక‌వైపు నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌లు మ‌రోవైపుగా కుర‌క్షేత్రం జరగబోతుందన్నారు.ప్ర‌గ‌తి భ‌వన్‌లో పేద ప్ర‌జ‌ల‌కు, అమ‌ర‌వీరుల కుటంబాల‌కు కూడా ప్ర‌వేశం లేకుండా నిషేధం విధించార‌ని తెలిపారు.కాంట్రాక్టర్లు, సినీనటులు, బంధువులను మాత్రమే అనుమతిస్తున్నారని రేవంత్‌ దుయ్యబట్టారు.టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అర్ధాంత‌రంగా అసెంబ్లీని ఎందుకు ర‌ద్దు చేసిందో  ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు.