మమ్మల్ని సమైక్యవాదులంటే చెప్పుతో కొడతాం...

 

తమను ఇకపై టీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ‘సమైక్యవాదులు’ అని అంటే వాళ్ళని చెప్పుతో కొడతామని తెలుగుదేశం నాయకుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ నాయకుడు, మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డి ఘాటుగా అన్నారు. మెదక్ జిల్లా గజ్వేల్‌లో జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఈ ఇద్దరు నాయకులు పై విధంగా ఫైర్ అయ్యారు. మెదక్లో ఒకవేళ టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే, ఫాంహౌస్లో కేసీఆర్ తాగే మందులో సోడా పోయడానికి, కవిత బ్యాగులు మోయడానికే పనికొస్తాడు తప్ప.. పార్లమెంటులో ప్రజాసమస్యల పరిష్కారానికి పనికిరాడని అన్నారు. తమను ఎవరైనా విమర్శిస్తే వాళ్ళతో బంతాడుకుంటామని జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి విమర్శించారు.