కేసీఆర్ మైండ్ గేమ్ ఆడుతున్నారు..

ఎర్రబెల్లి దయాకర్ టీడీఎల్పీని టీఆర్ఎస్ విలీనం చేస్తున్నామంటూ స్పీకర్ మధుసూదనా చారికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎర్రబెల్లి రాసిన లేఖపై టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎర్రబెల్లిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మైండ్ గేమ్ ఆడుతున్నారని.. ఎర్రబెల్లి ఏకపక్షంగా లేఖ రాశారని మండిపడుతున్నారు. కాగా స్పీకర్ కి ఎర్రబెల్లి లేఖ రాసిన నేపథ్యంలో భవిష్యత్తు కార్యాచరణ పైన చర్చించేందుకు తెలంగాణ టిడిపి సభ్యులు జాతీయ అధ్యక్షులు చంద్రబాబుతో భేటీ కానున్నారు.