ఎర్రబెల్లిపై రేవంత్ ఫైర్.. అప్పుడ రాత్రి ఇప్పుడు పగలు అంతే..

ఎర్రబెల్లి దయాకర్ రావు టీడీపీని నుండి టీఆర్ఎస్ లోకి జంప్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై రేవంత్ రెడ్డి స్పందిస్తూ ఎర్రబెల్లిపై దుమ్మెత్తి పోశారు. ఎప్పటినుండో టీఆర్ఎస్ తో ఎర్రబెల్లి స్నేహం చేసేవారని.. ఇప్పుడు అది బయట పడిందని అన్నారు. ఇన్ని రోజులు చీకటిలో మంతనాలు జరిపేవారు.. ఇప్పుడు పగలు కలుస్తారు అంతే.. అంతకు మించి తేడా ఏం లేదని మండిపడ్డారు. తెలంగాణలో కులాల వారీగా రాజకీయ నేతలు ఏకమవుతున్నారని అన్నారు. అంతేకాదు ఈ సందర్బంగా ఆయన కేసీఆర్ కు సవాల్ కూడా విసిరారు. దమ్ముంటే అందరి చేత రాజీనామా చేయించి గెలిపించుకోవాలని సవాల్ విసిరారు.