పంచలోహ విగ్రహాలపై కన్నేసిన స్మగ్లర్లు

posted on: Aug 21, 2012 8:52AM

నెల్లూరు జిల్లాలో దొంగల భయం నానాటికీ పెరుగుతోంది. చిన్న చిన్న దొంగతనాలు ఇక్కడ షరా మామూలే! పోలీసులూ ఈ దొంగ తనాలపై అసలు దృష్టి పెట్టలేదు. దీంతో దొంగలు రెచ్చిపోతున్నారు. పెద్దపెద్ద షాపుల్లో సినీఫక్కీలో దొంగతనాలు చేస్తున్నారు. ముదిరిపోయిన ఈ దొంగతనాల గురించి తెలిసి ఇతర రాష్ట్రాల నుంచి కొందరు వ్యాపారులు నెల్లూరు వచ్చి వెళ్తున్నారని సమాచారం. విదేశాల్లో భారతీయ పంచలోహ విగ్రహాలకు భారీగా డిమాండు ఉంది. ప్రత్యేకించి పూజలందు కున్న విగ్రహాలను విదేశీయులు ఎక్కువ డబ్బుపోసి కొంటారని సమాచారం. అందుకని వ్యాపారులు స్థానిక దొంగలను కలిసి ఆ విగ్రహాలు కోరి ఉంటారని నెల్లూరు జిల్లాలో చెప్పుకుంటున్నారు. వ్యాపారులు కోరుకున్న విధంగా దొంగతనాలు చేయటానికి దొంగలు సంసిద్ధత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ ఇంటలిజెన్స్‌ నివేదికకు తగ్గట్టుగానే తాజాగా నెల్లూరు జిల్లా కోవూరు మండలం లే గుంటపాడు గ్రామంలోని చెన్నకేశవస్వామిఆలయంలోని పంచలోహవిగ్రహాల దొంగతనం జరిగింది. మొత్తం 7విగ్రహాలు, మూడు తాళిబొట్లు దొంగతనం చేశారు. వీటిని ఇతరరాష్ట్రాల వారి ద్వారా తరలించేశారని సమాచారం. ఈ ఘటనపై ఆలయ సిబ్బంది ఫిర్యాదు మేరకు క్లూస్‌టీం రంగంలోకి దిగింది. ఈ క్లూస్‌టీం ఘటన ఆధారంగా సాక్షులను విచారించి దర్యాప్తు కొనసాగిస్తోంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...